టీవీకే పార్టీ విస్త‌ర‌ణ బాధ్య‌త‌లు కీర్త‌న‌కు

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పార్టీ చీఫ్

చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే టీవీకే పార్టీని ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ మేర‌కు పూర్తి బాధ్య‌త‌లు ప‌లు భాష‌లు మాట్లాడే మంత్రి కీర్త‌న‌కు అప్పగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఆమె ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. తమిళనాడు ప్రభుత్వంలో బహు భాషలు మాట్లాడగల మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు కీర్త‌న‌. త‌ను రాష్ట్రంలోని శివ‌కాశి నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు టీవీకే పార్టీ నుంచి.

పార్టీని కేవలం తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించే బాధ్యతను అప్పగించారు.
టీవీకే ఇప్పటికే కేరళ, కర్ణాటకలలో ప్రారంభమైంది, భారీ సంఖ్యలో ప్రజలు ఇందులో చేరుతున్నారు. ఈ పార్టీ దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను ఖచ్చితంగా కబళిస్తుందనే అంచ‌నాలు ఉన్నాయి..మంత్రి కీర్త‌న హిందూ భాషలలో కూడా అద్భుతంగా మాట్లాడతారు, టీవీకే పార్టీ ఉత్తర భారతదేశంలో కూడా విస్తరించేలా ప్లాన్ చేసింది. ప్ర‌స్తుతం ఎవ‌రి అండ , మ‌ద్ద‌తు లేకుండానే కేవ‌లం 2 సంవ‌త్స‌రాల‌లోనే త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో నూత‌న అద్యాయానికి శ్రీ‌కారం చుట్టారు విజ‌య్. ఒంట‌రిగా 108 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. ప‌లు పార్టీల మ‌ద్దతుతో స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *