మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు

నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయ‌ని, అక్కడ చేపల పెంపకం చేపట్టాల‌ని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం నెల్లూరు జిల్లా కావ‌లిలో మ‌త్స్య‌కారులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం అని తెలిపారు సీఎం. చేపల వేటతో పాటు కొత్త ఆదాయ మార్గాలను కూడా మత్స్య కారులకు అందుబాటులోకి తెస్తాం అన్నారు. మన రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉందని, సముద్ర తీరప్రాంతంలో నివసించే మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు చేపడుతున్నాం అన్నారు.

టెక్నాలజీతో పాటు… వినూత్న పద్దతుల ద్వారా మత్స్య కారులను ఆర్థికంగా ఆదుకుంటాం అని భ‌రోసా ఇచ్చారు చంద్ర‌బాబు నాయుడు. చేపల వేటకు వెళ్లే మత్స్య కారులకు అండగా నిలబడడమే కాకుండా… మత్స్య కార మహిళలకు ఉపాధి కల్పించి.. ఆర్థిక సాధికారత కల్పిస్తాం అని భ‌రోసా ఇచ్చారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం అన్నారు. మత్స్య కార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు సముద్రపు నాచు పెంపకం ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చేస్తామ‌ని తెలిపారు. చేపలు మంచి పౌష్టికాహారం. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంద‌న్నారు. ప్రోటీన్ ఉన్న ఈ ఆహారానికి అన్ని చోట్లా గిరాకీ ఉందన్నారు. మత్స్య ఉత్పత్తులకు గిరాకీ సృష్టించేలా మార్కెటింగ్ మేనేజర్ గా వ్యవహరిస్తానంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *