ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

ఓ టీవీ ఛానెల్‌పై కూడా కేసు ఫైల్

అమ‌రావ‌తి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ , అన‌లిస్ట్ నాగేశ్వ‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న తాజాగా ఓ టీవీ ఛాన‌ల్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు న‌మోదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఇదిలా ఉండ‌గా టీవీ ఛాన‌ల్ లో కీల‌క అంశంపై డిబేట్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌కు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం వ‌చ్చింద‌ని, ప్ర‌ధానంగా ఆయ‌న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ‌న‌సేన పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింద‌ని, ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీకి వెళ్లార‌ని, త‌న‌తో పాటు నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా దేశ రాజ‌ధానికి వెళ్లార‌ని ఆ స‌మ‌యంలో త‌మ‌పై తీవ్ర ఒత్తిడి వ‌చ్చింద‌ని, జ‌గ‌న్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరార‌ని అన్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబుతో తాత్కాలిక సంబంధం ఉంటుంద‌ని, కానీ జ‌గ‌న్ రెడ్డితో లాంగ్ టర్మ్ రిలేష‌న్ షిప్ ఉంద‌ని ఆ విష‌యం త‌న‌కు తెలిసింద‌న్నారు. దీంతో త‌న‌పై ఫిర్యాదు చేశారు జ‌న‌సైనికులు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *