నాగ చైత‌న్య‌కు ఊర‌ట‌నిచ్చిన ఢిల్లీ కోర్టు

త‌న వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగించొద్దు

న్యూఢిల్లీ : ఏం మాయ చేశావే, తండేల్ లాంటి విజ‌య‌వంతమైన చిత్రాల‌లో హీరోగా ప్రూవ్ చేసుకున్న అక్కినేని నాగ చైత‌న్య‌కు ఊర‌ట ఇచ్చేలా ఢిల్లీ కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌ను దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల దావాపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సూచించింది. తన పేరును ఉపయోగించే అశ్లీల వెబ్‌సైట్లు, అనధికారిక వస్తువులు, తనను, తన మాజీ భార్యను చూపిస్తూ ఏఐ (AI) రూపొందించిన కంటెంట్, తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ మేర‌కు నాగ చైత‌న్య తర‌పున న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌ను ఆరోపించిన యూట్యూబ్ వీడియోలతో సహా పలు ఆన్‌లైన్ ఉల్లంఘనల నుండి రక్షణ ఇవ్వాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు క్యూ క‌ట్టారు కోర్టుల చుట్టూ. త‌మ వ్య‌క్తిత్వాల‌ను హ‌రించే విధంగా ఏఐ తో జుగుస్సార‌కంగా, బూతులతో, అశ్లీల కంటెంట్ పోస్టు చేస్తున్నారంటూ వాపోయారు. త‌మ‌ను వాడుకుంటే చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు. ఇటీవ‌ల క‌న్న‌డ న‌టి కూడా త‌నకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కావ‌ని పేర్కొంది.

  • Related Posts

    రూ. 40 కోట్ల‌కు చేరువ‌గా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ

    హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా…

    ప‌ట్టుద‌ల‌తో న‌టిగా ప్రూవ్ చేసుకున్న భాగ్య‌శ్రీ భోర్సే

    హైద‌రాబాద్ : ముంబైకి చెందిన భాగ్య‌శ్రీ బోర్సే ఎట్ట‌కేల‌కు త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో ఆశించిన స‌క్సెస్ రాక పోయినా ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల‌లో న‌టించినా జ‌నం ఆద‌రించ‌లేదు. కానీ తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *