ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు సీఎం. ప‌ర్యావ‌ర‌ణ హితంగా బ‌స్సులు ఉండాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందులో భాగంగానే ఇక నుంచి అన్ని విభాగాల‌లో ఈవీ బ‌స్సులు వినియోగించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌లిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. రానున్న రోజుల్లో పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

స్త్రీ శక్తి పథకం ఆర్టీసీపై భారం కాదని , ఇది సామాజిక బాధ్య‌త అని తాము భావిస్తున్నామ‌న్నారు .
ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్ల‌డించారు. సిబ్బంది, కండెక్ట‌ర్లు, మెకానిక్ లు, డ్రైవ‌ర్లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు మధ్య విడదీయరని అనుబంధం ఉందన్నారు. పీపీపీ విధానంలో డిపోల ఆధునీకరణ చేపడతాం అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు. రెండేళ్లలో నైట్ అలవెన్స్ సహా ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారం చేశామ‌ని తెలిపారు. 3000 కొత్త ఈవీ బస్సులతో ఆర్టీసీకి కొత్త రూపు రానుందన్నారు.

  • Related Posts

    పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాల‌మూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను…

    ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

    Spread the love

    Spread the loveరేపు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నుంది న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ట్టుండి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఇండియాకు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *