డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

Spread the love

మే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ అమలుకు గాను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీను రేపు (సోమవారం) ప్రకటించే అవకాశముంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు అర్ధిక (ఫైనాన్స్) శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్​ జారీ చేసింది. మే 31లోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది . ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

  • Related Posts

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    Spread the love

    Spread the loveఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో…

    బుర్రా విజ‌య‌శేఖ‌ర్ కు రామ‌కృష్ణ పుర‌స్కారం

    Spread the love

    Spread the loveసీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా గుర్తింపు పొందారు హైద‌రాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *