తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం నివాళి

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్స‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూల మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక ప‌రంగా , రాజ‌కీయ ప‌రంగా తీవ్ర నిరాద‌ర‌ణ‌కు గురైంది. వంద‌లాది మంది పోరాటాలు, ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, స‌మ్మెలు చేప‌ట్టారు. ఆంధ్ర ప్రాంత దోపిడీకి వ్య‌తిరేకంగా గ‌ళం ఎత్తారు. చివ‌ర‌కు గ‌త్యంతరం లేక ఎంద‌రో బ‌లిదానాలు చేసుకోవ‌డంతో అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం సోనియా గాంధీ సూచ‌న‌ల మేర‌కు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ప్ర‌క‌టించారు. జూన్ 2014 లో కొత్త రాష్ట్రం ఏర్ప‌డింది.

  • Related Posts

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    విప‌క్షాల నినాదాల మ‌ధ్య రాజ్య‌స‌భ వాయిదా

    న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా ప‌డింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *