జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌరవం ఎక్కువ అని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళవారం ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా , రాజకీయ పరంగా తీవ్ర నిరాదరణకు గురైంది. వందలాది మంది పోరాటాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు చేపట్టారు. ఆంధ్ర ప్రాంత దోపిడీకి వ్యతిరేకంగా గళం ఎత్తారు. చివరకు గత్యంతరం లేక ఎందరో బలిదానాలు చేసుకోవడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ సూచనల మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. జూన్ 2014 లో కొత్త రాష్ట్రం ఏర్పడింది.





