కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే
అమెరికా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొద్దింకల జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. తన ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన శనివారం పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. ఈ సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున ఈ నిరసనకు లోపాయికారిగా మద్దతు ఇస్తుండడం విస్తు పోయేలా చేసింది. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముగ్గురు కీలకమైన వ్యక్తులను అధికార ప్రతినిధులుగా నియమించాడు అభిజిత్ దిప్కే.
ఈ సందర్బంగా తను కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్కు తిరిగి వస్తున్న తరుణంలో ఢిల్లీ విమానాశ్రయం వద్ద గుమిగూడవద్దని తన మద్దతుదారులను, విద్యార్థులను కోరారు. దిప్కే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. మనం చట్టాన్ని గౌరవించే పౌరులం, కాబట్టి విమానాశ్రయం వద్ద ఎటువంటి గుంపులు లేదా నిరసనలు చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తన పార్టీ త్వరలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు కూడా దిప్కే ప్రకటించాడు.
ఢిల్లీకి చేరుకునే ముందు దిప్కే వైఖరిలో వచ్చిన ఈ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.





