త్వ‌ర‌లో ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి

అమ‌రావ‌తి : త్వ‌ర‌లో ఏపీలో ఇంట‌ర్ ఫ‌స్ట్, సెకండ్ ఇయ‌ర్ ఫలితాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. రిజ‌ల్ట్స్ ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు ఇటీవ‌లే ఇంట‌ర్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. దీంతో ఏపీపై ఒత్తిడి పెరిగింది. విశ్వ‌స‌నీయ‌మైన సమాచారం ప్రకారం AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే, ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఖచ్చితమైన సమయాన్ని బోర్డు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

సప్లిమెంటరీ పరీక్షలు 2026 మే 21 నుండి జూన్ 4 వరకు జరిగాయి, అలాగే ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుండి జూన్ 11 వరకు నిర్వహించారు. సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షలలో కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించ లేక పోయిన విద్యార్థులకు ఈ పరీక్షలు రెండవ అవకాశాన్ని కల్పించాయి. కాగా ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు bie.ap.gov.in లేదా resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించాల్సి ఉంటుంది. తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా తమ మార్కుల మెమోను పొందవచ్చు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *