ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు

మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ సంస్థ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడ‌ని, గ‌త కొన్నేళ్లుగా త‌మ సంస్థ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌. RSS ఒక సంస్థగా నమోదు చేసుకోవాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై భ‌గ‌వ‌త్ స్పందించారు.

ఆ చర్య రాజకీయ ప్రేరేపితమని, ప్రజల మనసుల్లో అనుమానాలు సృష్టించే ఉద్దేశంతో కూడుకున్నదని RSS చీఫ్ అన్నారు. అనేక విషయాలు నమోదు కాకుండానే ఉన్నాయి… హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ నిధులు అవసరమైన వారు మాత్రమే నమోదు చేసుకుంటారని స్ప‌ష్టం చేశారు. మా ఉనికి గురించి ప్రభుత్వానికి తెలుస అన్నారు. ; గతంలో ప్రభుత్వం మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది కూడా అని మ‌రోసారి గుర్తు చేశారు మోహన్ భగవత్ .

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *