14.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు విజ‌య్ రుణ‌మాఫీ

తమిళనాడు ముఖ్య‌మంత్రి సంచలన నిర్ణయం
చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల హామీలో భాగంగా రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఆ మేర‌కు బుధ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను రైతు ప‌క్ష‌పాతిన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు సీఎం.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో స‌హ‌కార రంగంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా సాగు కోసం రుణాలు తీసుకున్న రైతుల‌కు ఒక్కొక్క‌రికి రూ.75,000 మేరకు వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14.43 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.5,932 కోట్ల మేర భారం పడనుంది. అయినా వెన‌క్కి త‌గ్గేది లేదంటూ స్ప‌ష్టం చేశారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *