లాట‌రీ విధానంలో ఇందిర‌మ్మ‌ ఇళ్ల కేటాయింపు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి. ఒకవైపు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే, మరోవైపు గృహాల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఈ నెల 20వ తేదీ నుండి దరఖాస్తుదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా లాటరీ విధానాన్ని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతే కాకుండా సంబంధిత ప్రాంతాలలో ‘ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’ నిర్మాణ పనులను చేపట్టేందుకు టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ ఇళ్లన్నింటినీ ఏడాదిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ఒక సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఇలా ఉన్నాయి. ఖైరతాబాద్ – 4,394, అంబర్‌పేట్ – 2,357, బహదూర్‌పుర – 1,135, ఇబ్రహీంపట్నం – 749, కూకట్‌పల్లి – 5,233, కార్వాన్ – 1,574, మహేశ్వరం – 471, మలక్‌పేట్ – 2,846, మల్కాజ్‌గిరి – 1,033, మేడ్చల్ – 1,153, నాంపల్లి – 3,613, సనత్ నగర్ – 1,046, కుత్బుల్లాపూర్ – 4,121, రాజేంద్రనగర్ – 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్ – 1,374, శేరిలింగంపల్లి – 2,530 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి కాల్ సెంటర్ ఫోన్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చని వైస్ చైర్మన్ సూచించారు.

  • Related Posts

    ప్ర‌తి ఒక్క‌రికీ ఓ విజ‌న్ ఉండాలి : చంద్ర‌బాబు నాయుడు

    విజ‌య‌వాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని చేయాలన్నారు. రాష్ట్రానికి…

    అగ్రిగేట‌ర్ల‌కు సంబంధించి త్వ‌ర‌లో మార్గ‌ద‌ర్శ‌కాలు

    హైదరాబాద్: గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు కొన్ని గంటల ముందు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా త‌ల‌పెట్టిన స‌మ్మెను విర‌మించేందుకు గిగ్, ప్లాట్ ఫామ్ సంస్థ‌ల నేత‌లు ఒప్పుకున్నారని ప్ర‌క‌టించారు మంత్రి డాక్ట‌ర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *