కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72 ఏళ్ల వయసులోనూ కేసీఆర్ బండరాయిలా దృఢంగా, స్థిరంగా ఉన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడి విషయంలో కూడా ఇంతటి అసహ్యకరమైన శీర్షికను రాసే స్థాయికి మీ జర్నలిజం విలువలు ఎలా దిగజారిపోయాయి?. ఒక కుటుంబం దుఃఖంలో ఉన్నప్పుడు వారి బాధ మీకు కనిపించదు. వారికి ఇచ్చిన భరోసా కనిపించదు. అందించిన ఆర్థిక సాయం కనిపించదు.. మీ కళ్లకు కనిపించేదల్లా కేవలం ద్వేషం మాత్రమే… మీ కలం నుండి వెలువడేది విషం మాత్రమే!

కేసీఆర్ పై మీకు రాజకీయ వ్యతిరేకత ఉంటే, వార్తా కథనాల ద్వారా దాన్ని ఎదుర్కోండి. వాస్తవాలతో విమర్శించండి..అంతేగానీ, ఒక వృద్ధ నాయకుడి విషయంలో మరణాన్ని సూచించే మాటలను శీర్షికగా మార్చి, వక్రీకరించిన సంచలనం కోసం పాకులాడటం జర్నలిజం అనిపించుకోదు. ఏళ్ల తరబడి మీ “బేబీ” కేసీఆర్ పై మీరు విషం చిమ్ముతున్నా, ఆయన స్థాయి ఏమాత్రం తగ్గలేదు. కానీ మీరు రాసే ప్రతి విషపూరిత శీర్షికతో మీ జర్నలిజం విలువలే మరింత దిగజారి పోతున్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి .కేసీఆర్ చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారు. ఆయన గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . ముందుగా, మీ కలంపై పట్టుకున్న ఆ ద్వేషాన్ని వదిలించుకోండి.. మీ జర్నలిజం విలువలు ఇంకా సజీవంగా ఉన్నాయేమో ఒకసారి సరిచూసుకోండి.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    విద్యార్థుల నిరసనలపై చర్చకు అమిత్ షా సిద్ధం

    న్యూఢిల్లీ : కేంద్ర పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. విద్యార్థుల ఉద్యమం , దానికి సంబంధించిన కార్యకలాపాలపై సమగ్రమైన, వివరమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *