శాంతి భద్రతలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ‌ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తంగా 1,300 మంది అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.

పోలీస్ స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన విశ్లేషణ చేయనున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న రిపోర్టులను ఈ సమావేశంలో నేరుగా అధికారుల ముందే ముఖ్యమంత్రి బయట పెట్టనున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరు కానుండగా, జిల్లాల్లోని మిగిలిన అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన బోతున్నారు.

  • Related Posts

    ఆగ‌స్టు 18 నుండి కేబీఆర్ పార్కు చుట్టూ వ‌న్ వే ట్రాఫిక్

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆగస్టు 18 నుండి KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. KBR పార్క్ చుట్టూ H-CITI ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు ,…

    ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలి : ట్రంప్

    అమెరికా : మధ్య ప్రాచ్యంలో హింస పెరుగుతుండగా ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలని ట్రంప్ కోరుతున్నారు. మ‌రో వైపు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. శాంతి చర్చల్లో ఇరాన్ పరిహారం కోరితే తాను కూడా పరిహారం డిమాండ్ చేస్తానని అధ్యక్షుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *