జార్ఖండ్ ఘ‌ట‌న‌పై రాహుల్ గాంధీ మౌన‌మేల‌..?

హైద‌రాబాద్ : తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏఐసీసీ మాజీ చీఫ్‌, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇవాళ బీజేపీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం (JMM) కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వేళ విద్యార్థులపై జరిపిన అమానుషమైన లాఠీచార్జ్ , పోలీసుల దాష్టీకం అత్యంత విషాదకరం అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ పార్లమెంటులో చర్చలకు దూరంగా ఉంటుండగా మరోవైపు జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన ఈ దారుణమైన ఘటనపై పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.

.ఇది ఆయన ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయట పెడుతోంద‌న్నారు ఎన్ .రామ‌చంద‌ర్ రావు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీకి, ఇప్పుడు జార్ఖండ్ యువత పడుతున్న బాధలు , వారి గొంతుకలు ఎందుకు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యులను చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. దేశం సమాధానాలను కోరుతోంది. రాహుల్ గాంధీ పార్లమెంటుకు వచ్చి తన ఈ ద్వంద్వ వైఖరిపై సమాధానం చెప్పాలని అన్నారు.

  • Related Posts

    ఆగ‌స్టు 18 నుండి కేబీఆర్ పార్కు చుట్టూ వ‌న్ వే ట్రాఫిక్

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆగస్టు 18 నుండి KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. KBR పార్క్ చుట్టూ H-CITI ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు ,…

    ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలి : ట్రంప్

    అమెరికా : మధ్య ప్రాచ్యంలో హింస పెరుగుతుండగా ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలని ట్రంప్ కోరుతున్నారు. మ‌రో వైపు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. శాంతి చర్చల్లో ఇరాన్ పరిహారం కోరితే తాను కూడా పరిహారం డిమాండ్ చేస్తానని అధ్యక్షుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *