‘వ‌న్ వార్డ్ ఎవ్రీ డే’లో స‌మ‌స్య‌ల వెల్లువ‌

హైద‌రాబాద్ : సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ జి. సృజ‌న వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ మేర‌కు వ‌న్ వార్డ్ ఎవ్రీ డే పేరుతో స్థానికుల‌తో స‌మావేశం కావ‌డం దీని ఉద్దేశం. ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో పాటు ఎమ్మెల్యే; సెరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్, మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ , సంబంధిత శాఖల అధికారులతో కలిసి శేరి లింగంప‌ల్లి జోన్ లోని మియాపూర్ స‌ర్కిల్, మదీన‌గూడ , హ‌ఫీజ్ పేట వార్డుల‌ను సంద‌ర్శించారు.

కమిషనర్ జి. సృజ‌న‌ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) ప్రతినిధులు , స్థానిక నివాసితులతో మాట్లాడారు, అలాగే వార్డు పర్యటనలో లేవనెత్తిన పౌర సమస్యలను సమీక్షించారు. ఇందులో ప్ర‌ధానంగా సీసీ కెమెరాల ఏర్పాటు, బీటీ రోడ్ల అవ‌స‌రాలు, మ‌ర‌మ్మ‌తులు, డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ (UGD) , వర్షపు నీటి పారుదల , నీరు నిలిచి పోవడానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావ‌న‌కు వ‌చ్చాయి. వీటితో పాటు వీధి దీపాలు , విద్యుత్ సంబంధిత పనులు, పార్కుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ట్రాఫిక్ , పాదచారుల రాకపోకలు, ఆక్రమణలు , చెత్తను అక్రమంగా పారవేయడం,
కమ్యూనిటీ హాల్ , శ్మశానవాటికకు సంబంధించిన పనులు చేప‌ట్టాల‌ని స్థానికులు కోరారు.

నివాసితులు లేవనెత్తిన సమస్యలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని, అలాగే గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

  • Related Posts

    హైద‌రాబాద్ లో స‌ర్ ప్ర‌క్రియ‌పై ప‌రిశీల‌న : క‌మిష‌న‌ర్

    హైద‌రాబాద్ : రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన స‌ర్ ప్ర‌క్రియ ముగిసింది. ఓట‌ర్ల తుది జాబితా పరిశీల‌న కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తున్నారు. తాజాగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం…

    పోల‌వ‌రం ద్వారా ఉత్త‌రాంధ్ర‌కు గోదావ‌రి జలాలు

    అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న ‘జలహారతి’…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *