రెండు ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత

తిరుప‌తి అన్న‌మ‌య్య‌ జిల్లా : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖకు అధికారికంగా అప్పగించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉదయం 10.30 గంటలకు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ సముదాయాల ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి మదనపల్లిలోని దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథంకు రెండు ఆలయాల బాధ్యతలను అధికారికంగా అప్పగించారు.

టీటీడీ పరిధిలో ఉన్న ఈ రెండు ఆలయాలతో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు, ఆభరణాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత దేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఏవో వెంకటరమణ, టాస్క్‌ఫోర్స్ తహశీల్దార్ లలితాంజలి, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ పద్మప్రియ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

    తిరుప‌తి అన్న‌మ‌య్య జిల్లా : అన్న‌మ‌య్య తిరుప‌తి జిల్లాలో పేరు పొందిన , భ‌క్తులు నిత్యం కొలిచేవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక…

    ఇస్కాన్ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం : ఈట‌ల

    హైద‌రాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *