ఏపీ ఉద్యోగుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించారు. ఇదిలా ఉండ‌గా సీఎం ప్రకటన పై సంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని, వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు సీఎం. 12వ PRC నియామకానికి అంగీకారం తెలిపారు. 2 రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లిస్తామ‌న్నారు. 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల చేశామ‌న్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేస్తామ‌ని పేర్కొన్నారు.

పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తించేలా చేస్తామ‌న్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం తెలిపామ‌న్నారు. ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు అవుతుంద‌ని అయినా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

  • Related Posts

    అమెరికా పౌరుడితో ష‌ర్మిల కూతురు పెళ్లి

    అమెరికా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి వైఎస్ అంజ‌లి రెడ్డి త్వ‌ర‌లో ఓ ఇంటిదానిగా మార‌బోతోంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన అమెరికా పౌరుడిని వివాహం చేసుకోనుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సామాజిక…

    ఈసీ స‌ర్ ప్ర‌క్రియ‌పై మాజీ సీఈసీ ఫైర్

    భువనేశ్వర్ : అనేక రాష్ట్రాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్) ప్రక్రియ కొనసాగుతుండగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ ఆదివారం నాడు భారత ఎన్నికల సంఘం (ఈసీ) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారులను గుర్తించడమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *