కేరళ : ట్రంప్ , ఆయన యంత్రాంగం అనేక ఏకపక్ష విధానాలను ముందుకు తీసుకువెళుతున్నందున బ్రిక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే బ్రిక్స్ కి ఒక ప్రత్యామ్నాయం. అందుకే మనం బిక్స్ ను బలోపేతం చేయాలి అని సీపీఐ రాజ్యసభ ఎంపీ పి. సంతోష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ BRICS శిఖరాగ్ర సమావేశానికి ముందు, ఆయన ఈ కూటమిని ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదికగా అభివర్ణించారు. అమెరికా యంత్రాంగం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ అగ్రనేతల భాగస్వామ్యం ఈ సమావేశానికి ప్రాముఖ్యతను చేకూరుస్తుందని, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో చర్చలు , ప్రాంతీయ సహకారం కీలకమని కుమార్ నొక్కి చెప్పారు. ష
ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమం, దీనికి అత్యంత కీలకమైన ప్రపంచ నాయకులు హాజరవుతున్నారు. దేశాల మధ్య అన్ని రకాల ప్రాంతీయ సహకారాలు చాలా అవసరం. ట్రంప్ , ఆయన యంత్రాంగం అనేక ఏకపక్ష విధానాలను అనుసరిస్తున్నందున బ్రిక్స్ మరింత ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ సమావేశం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే చర్చలు , సంప్రదింపులు ఏవైనా స్వాగతించదగినవే. కాబట్టి చర్చల ఫలితాల కోసం మనం వేచి చూడాలి అని అన్నారు.





