ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ

రిజ‌ర్వేష‌న్ల‌లు అమ‌లు చేసేంత దాకా పోరాటం ఆగ‌దు

హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ శ‌నివారం ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలో బీసీ విద్యార్థులు క‌దం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుండి తార్నాక చౌరస్తా వరకు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు . ఈ ర్యాలీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో BC జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాల‌ని డిమాంండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి అనే విలువలపై ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వం BC వర్గాలకు అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున బీసీ బంద్ కు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ చైర్మ‌న్ బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణ‌య్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని , అమ‌లు చేసేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రాజ‌కీయాలు చేయ‌డం మానుకుని అమ‌లుపై ఫోక‌స్ పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *