విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంది : గొట్టిపాటి

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినుల‌కు సైకిళ్ల పంపిణీ

అమ‌రావ‌తి : అన్నింటి కంటే విద్య గొప్ప‌ద‌ని, దానిని పొందితే ఎక్క‌డైనా వెళ్లి బ‌త‌క వ‌చ్చ‌ని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, జీవితంలో అత్యంత ముఖ్య‌మైన‌ది ఈ బాల్య‌మేన‌ని, దీనిని స‌క్రమంగా వినియోగించు కోవాల‌ని సూచించారు విద్యార్థుల‌కు. మంగ‌ళ‌వారం జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని పీఎస్‌ఎన్ సీసీ జెడ్పీ పాఠశాలలో 110 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అంద జేశారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5,100కిపైగా విద్యార్థులు, విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.

దూరాభారంతో చిన్నారులు పాఠశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. సీఎస్ఆర్ నిధులు, దాతలు, వ్యాపార సంస్థల సహకారంతో మరింత మంది విద్యార్థులకు సైకిళ్లు అందించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సైకిళ్ల పంపిణీ అనంతరం పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతున్నట్టు గమనించడం సంతోషకరం అన్నారు. జాతీయ రహదారులపై సైకిళ్లతో ప్రయాణించే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా రహదారి పక్కనే సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా విద్యార్థులను అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. విద్యార్థుల సైకిల్ ప్రయాణాలపై తల్లిదండ్రులు కూడా అవసరమైన జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *