నేత‌న్న‌ల‌ను ఆదుకోవాలి సబ్సిడీ విడుద‌ల చేయాలి

Spread the love

కాంగ్రెస్ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

వ‌న‌ప‌ర్తి జిల్లా : చేనేత కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో స‌ర్కార్ వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం జాగృతి జ‌నం బాట‌లో భాగంగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించారు. కొత్త‌కోట మండ‌ల కేంద్రంలోని వీవ‌ర్స్ కాలనీలో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను క‌విత‌కు విన్న‌వించారు. అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో చేనేత‌ల‌కు సబ్సిడీ, ప‌నిముట్లు, పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించార‌ని కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరాక కేవ‌లం పెన్ష‌న్ మాత్ర‌మే ఇస్తూ స‌బ్సిడీ ఇవ్వ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు క‌విత‌.

చేనేత కుటుంబంలో ఒకరికి చేనేత పెన్షన్ ఇచ్చినా స‌రే సాధార‌ణంగా ప్ర‌తి నెలా ఇచ్చే పెన్ష‌న్ ను కూడా వ‌ర్తింప చేయాల‌ని డిమాండ్ చేశారు. నారాయ‌ణ‌పేట‌, కొత్త‌కోట‌, గద్వాల చీర‌లు దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందాయ‌ని నేటికీ మ‌హిళ‌లు ధ‌రిస్తున్నార‌ని కానీ వాటిని నేసే వారి ప‌రిస్థితి మాత్రం దారుణంగా ఉంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. స‌రైన మార్కెట్ స‌దుపాయం లేద‌న్నారు. చీరలు నేసినప్పటికీ సొంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింద‌ని ఆవేద‌న చెందారు. దీంతో చాలా మంది నేత కార్మికులు కూలీకి వెళ్తున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే ఆదుకోవాల‌ని, స‌బ్సిడీని వెంట‌నే రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా విరివిగా రుణాలు కూడా ఇవ్వాల‌న్నారు. నైపుణ్యం క‌లిగిన నేత‌న్న‌ల‌ను ఆదుకోక పోతే చేనేత క‌ళ అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    Spread the love

    Spread the loveస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు.…

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *