పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ మెరుగైన వ్య‌వ‌సాయ దిగుబ‌డి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. సాగు అనేది దండుగ కాద‌ని అది పండుగ అని పేర్కొన్నారు. రైతుల‌ను ల‌క్ష‌లాధికారుల‌ను చేసే బాధ్య‌త స‌ర్కార్ తీసుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో పంట‌లు న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు సీఎం. రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌ తదితర అంశాలపై మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాయలసీమలోని పండ్ల తోటల రైతుల ఆదాయం పెంచేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు సంబ‌ధిత అధికారుల‌ను. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    మెట్టూరు ఆన‌క‌ట్ట నుండి నీటిని విడుద‌ల చేసిన సీఎం

    చెన్నై : తమిళనాడు ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళవారం కావేరి డెల్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం…

    రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్

    తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *