నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

మాగంటి గోపీనాథ్ అనుచ‌రుల‌తో ప్ర‌మాదం

హైద‌రాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫ‌సియోద్దీన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో త‌న‌కు ప్రాణహాని ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. లేఖ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న కోరారు. త‌న‌కు , నా కుటుంబానికి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్ మృతిని నాపై రుద్దే ప్రయత్నం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు 50వేల మెజారిటీ వచ్చేదన్నారు. మెజార్టీ రాకుండా అడ్డుకున్నది కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న కోవర్టులేన‌ని ఆర‌పించారు బోర‌బండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్. ఇదిలా ఉండ‌గా తాజాగా మాజీ డిప్యూటీ మేయ‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో. దీనిపై ఇంకా ఎలాంటి విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు స‌ర్కార్. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు ఫ‌సియోద్దీన్.

  • Related Posts

    మెట్టూరు ఆన‌క‌ట్ట నుండి నీటిని విడుద‌ల చేసిన సీఎం

    చెన్నై : తమిళనాడు ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళవారం కావేరి డెల్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం…

    రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్

    తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *