విద్య‌, వైద్యం మాత్ర‌మే ఉచితంగా ఇవ్వాలి

Spread the love

స్ప‌ష్టం చేసిన మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌

అమ‌రావ‌తి : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. స‌మాజంలో మ‌రింత అంత‌రాలు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌తిదీ ఉచితంగా అల‌వాటు చేస్తూ పోతే చివ‌ర‌కు ప‌ని చేసే వారంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని అభిప్రాయ ప‌డ్డారు. అది రాష్ట్రానికి, దేశానికి, ముఖ్యంగా స‌మాజానికి మంచిది కాద‌ని పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. ఏ ప్ర‌భుత్వ‌మైనా స‌రే ఏవీ ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదని స్ప‌ష్టం చేశారు. విద్య‌, వైద్య రంగాలు ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని అన్నారు. మ‌హిళ‌లు ఉచితంగా త‌మ‌కు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అడిగారా అని ప్ర‌శ్నించారు.

విద్య వ‌ల్ల వికాసం అల‌వ‌డుతుంద‌న్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. రోజు రోజుకు విద్య‌, వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ శ‌క్తుల చేతుల్లోకి వెళ్లి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. విలువ‌లే ప్రాతిప‌దిక‌గా ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌ల‌ని, వారికి ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. విద్య‌తోనే ఉపాధి ల‌భించ‌డంతో పాటు స‌మాజంలో అత్యున్న‌త గౌర‌వం ల‌భించేలా చేస్తుంద‌ని , అందుకే ప్ర‌తి ఒక్క‌రు చ‌దువుపై దృష్టి పెట్టాల‌ని అన్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

  • Related Posts

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    Spread the love

    Spread the loveమాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా…

    జ‌గ‌న్ ప్రోద్బ‌లంతోనే దాడుల ప‌రంప‌ర‌ : ఎస్. స‌విత

    Spread the love

    Spread the loveకులాల మధ్య కొట్లాటకు కుట్ర‌ల‌కు తెర లేపారు శ్రీ స‌త్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల ప‌రంప‌ర‌కు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *