నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

Spread the love

కూట‌మి స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌తిపక్ష హోదా ఎందుకు ఇవ్వ‌డం లేదో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడో తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

సభలో ఏమీ జరగక పోయినా ఒక డ్రామా క్రియేట్ చేశాడ‌ని, ఆ త‌ర్వాత చాలా తెలివిగా ఏడ్పు రాక పోయినా ఏదో జ‌రిగి పోయిన‌ట్లు, కొంప‌లు కూలి పోయిన‌ట్లు తెగ న‌టించాడ‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న చేసిన న‌ట‌న‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు విస్తు పోయార‌న్నారు. సినిమాల‌లో న‌టించే న‌టులు సైతం ఆశ్చ‌ర్య పోయేలా ఏడ్చాడ‌ని, దీంతో అంద‌రూ త‌న‌కు ఏదో అయి పోతోంద‌ని విస్మ‌యానికి లోన‌య్యార‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. తాను గన‌క శాస‌న స‌భ‌లో ఉంటే అసెంబ్లీకి రానంటూ వెళ్లి పోయాడ‌ని, ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయాడ‌ని ఇప్పుడు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు మాజీ సీఎం. అసెంబ్లీ రికార్డులు మొత్తం తిరగేశాన‌ని, కానీ ఎక్క‌డా మావాళ్లుతప్పు మాట్లాడలేద‌ని, ఆ విష‌యం తేలి పోయింద‌న్నారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *