ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కామెంట్స్
అనంతపురం జిల్లా : కూటమి సర్కార్ మహిళల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఇందులో భాగంగా వారిని వ్యాపారేవత్తలుగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. అంతే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. శింగనమల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్బంగా మహిళలతో మాట్లాడారు. వారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రూడ్ సెట్ సంస్థ ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ – ఎంటర్ ప్రెన్యూరు ప్రమోషన్ గురించి శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు.
అలాగే సింగనమల నియోజకవర్గ పరిధిలోని ఎస్.హెచ్.జి. గ్రూపు సభ్యులకు బాంక్ లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి పథకంల ద్వారా 4002 మహిళా పొదుపు సంఘాలకు 334.77 కోట్ల రూ.ల చెక్ ను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.. స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ NRLM ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం–SERP సహకారంతో అమలవుతున్న కీలక కార్యక్రమమే SVEP అని పేర్కొన్నారు. మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాకుండా మహిళల హక్కులు, గౌరవం, భద్రత, స్వావలంబనను సమాజం గుర్తించడమేనని అన్నారు బండారు శ్రావణి శ్రీ.





