పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాలి

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తో క‌లిసి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు . ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఇదే స‌మ‌యంలో దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.

ఏ పార్టీకి అయినా కార్య‌క‌ర్త‌లే బ‌లం, బ‌ల‌గ‌మ‌ని పేర్కొన్నారు. గ‌తంలో కొలువు తీరిన జ‌గ‌న్ రెడ్డి వైసీపీ స‌ర్కార్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్యం చేయ‌డంతో వాటిని చ‌క్క‌దిద్దేందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట ప‌డుతున్నాడ‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి గ‌ణ‌నీయ‌మైన కార్య‌క‌ర్త‌లు స‌భ్యులుగా ఉన్నార‌ని చెప్పారు. కార్య‌క‌ర్త‌ల‌కు నారా లోకేష్ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఇస్తున్నార‌ని , దీనిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌తి ఒక్క‌రు పార్టీ అభివృద్ది కోసం అంకితం కావాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    జూన్ 8వ తేదీ లోపు ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌చ్చే జూన్ 8వ తేదీ లోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *