న‌వ్వుల‌పాలు కాకుండా బ‌తికిన‌ ఎంఎస్

నవ్వడం తెలిసిన అరుదైన న‌టుడు

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరుదైన న‌టుడు ఎంఎస్ నారాయ‌ణ‌. ఏప్రిల్ 16 ఆయన జ‌యంతి. ఈ సంద‌ర్బంగా మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఎంఎస్ న‌టుడు మాత్ర‌మే కాదు అరుదైన వ్య‌క్తి అని పేర్కొన్నారు. నవ్వించ గలిగినవాడు,
నవ్వుల పాలు కాకుండా బ్రతికిన వాడు , మంచి వాడు, మ‌న వాడు అంటూ కితాబు ఇచ్చారు. ఆయ‌న‌ను గుర్తు చేసుకున్నారు. ఎం.ఎస్. నారాయణ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడిగా వెలుగొందారు. ఆయన తన ప్రత్యేకమైన హాస్య శైలితో ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు నవ్వించారు.

ఎంఎస్ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. 16 ఏప్రిల్ 1951 లో పుట్టారు. వృత్తి ప‌రంగా నటుడు, దర్శకుడు, రచయితగా గుర్తింపు పొందారు. ఎం.ఎస్. నారాయణ మొదట తెలుగు లెక్చరర్‌గా పని చేశారు. తరువాత సినిమాలపై ఆసక్తితో సినీ రంగంలోకి వచ్చారు. ఆయన కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేశారు. కానీ తరువాత హాస్యనటుడిగా భారీ గుర్తింపు పొందారు. ఎంఎస్ 700కి పైగా సినిమాల్లో నటించారు. వాటిలో దూకుడు, బాద్ షా, దుబాయ్ శ్రీ‌ను, కింగ్, రెడీ సినిమాలు చాలా గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేశాయి. తన డ్రంక్ కామెడీ పాత్రలు చాలా ప్రసిద్ధి చెందాయి . చాలా సినిమాల్లో లెక్చరర్, పోలీస్, పూజారి వంటి పాత్రల్లో కనిపించారు.

  • Related Posts

    రూ. 40 కోట్ల‌కు చేరువ‌గా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ

    హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా…

    ప‌ట్టుద‌ల‌తో న‌టిగా ప్రూవ్ చేసుకున్న భాగ్య‌శ్రీ భోర్సే

    హైద‌రాబాద్ : ముంబైకి చెందిన భాగ్య‌శ్రీ బోర్సే ఎట్ట‌కేల‌కు త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో ఆశించిన స‌క్సెస్ రాక పోయినా ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల‌లో న‌టించినా జ‌నం ఆద‌రించ‌లేదు. కానీ తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *