కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయ్
చెన్నై : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పార్టీ బాస్, సీఎం ఎంకే స్టాలిన్. ఇదే సమయంలో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ప్రచారంలో దూసుకు పోతోంది. నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీలలో చేరుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ నటి అను శ్రీ వేనాల్ ఆసక్తికరంగా మారారు. తను టీవీకే పార్టీలో చేరారు.
చెన్నై లో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ , అగ్ర నటుడు దళపతి విజయ్ సారథ్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు అను శ్రీ వేనాల్. ఈ సందర్భంగా ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఆమెతో పాటు పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రజలను ఉద్దేశించి టీవీకే బాస్ విజయ్ ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు తెర లేపారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మొత్తంగా ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఉత్కంఠ నెలకొంది.







