హైద‌రాబాద్ లో భారీ అవినీతి తిమింగ‌లం ప‌ట్టివేత‌

HMWSSB జనరల్ మేనేజర్ ఆభ‌ర‌ణాలు, నోట్ల క‌ట్ట‌లు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో మ‌రో భారీ అవినీతి తిమింగ‌లం ప‌ట్టుబ‌డింది. మంగ‌ళ‌వారం ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని స‌మాచారం రావ‌డంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) ఏక‌కాలంలో దాడులు చేప‌ట్టింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన నివాసంలో. ఈ దాడుల‌లో క‌ళ్లు చెదిరేలా నోట్ల క‌ట్ట‌లు, బంగారు ఆభ‌ర‌ణాలు బ‌య‌ట ప‌డ్డాయి. అంత‌కు మించి అక్ర‌మంగా కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన ప‌త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌దు ఏకంగా రూ. 1.06 కోట్లు ల‌భించ‌డంతో విస్తు పోయారు ఏసీబీ సిబ్బంది.

అక్రమాస్తుల కేసులో భాగంగా HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ (GM) అయిన కుమార్ నివాసంపై మంగళవారం ACB అధికారులు సికింద్రాబాద్‌లో దాడులు నిర్వహించారు . ఈ సోదాల సమయంలో అధికారులకు బంగారు ఆభరణాలు , పలు ఆస్తి పత్రాలు కూడా లభించాయి. బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉంది ఇప్ప‌టి దాకా రూ. 1.05 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండి లభించిన‌ట్లు ఏసీబీ ప్ర‌క‌టించింది. జనరల్ మేనేజర్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ప‌లు చోట్ల ఇంకా సోదాలు కొన‌సాగుతున్నాయి.

  • Related Posts

    ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల కేంద్రంగా తెలంగాణ : సీఎం

    హైద‌రాబాద్ : తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో…

    రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసిన జ‌ర్న‌లిస్టులు

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధ‌వారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *