సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్
హైదరాబాద్ : సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం డ్రాగన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు . దీంతో ఈసినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మూవీ మేకర్స్ తారక్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుష్ కలిగించేలా టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ , అనిల్ కపూర్ , మరో కీలక నటి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. యశ్ కేజీఎఫ్, ప్రభాస్ సలార్ తర్వాత వస్తున్న మూవీ డ్రాగన్. అందుకు తగ్గట్టుగానే మరోసారి తన మార్క్ ను చూపించే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ నీల్.
ఈ ప్రాజెక్ట్ను చాలా నెలలుగా ఎన్టీఆర్ నీల్ అని పిలిచారు. కానీ ఇవాళ విడుదలైన టీజర్ లో డ్రాగన్ మూవీ పేరు ఖరారు చేశారు. దీంతో అనుమానాలకు తెర పడింది. దీంతో పండుగ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మే 20న అర్ధరాత్రికి కొద్దిసేపటి ముందు ఈ టీజర్ను విడుదల చేశారు. మరో వైపు డ్రాగన్ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఈ వీడియోలో “లూగర్” అనే ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. అలాగే, 1960ల నాటి గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతం , నల్లమందు వ్యాపారం నేపథ్యంలో సాగే సన్నివేశాలను చూపించారు. ఈ టీజర్లో నటులు అనిల్ కపూర్, బిజు మీనన్ , రుక్మిణి వసంత్ కూడా ఉన్నారు.







