జూన్ 2 వరకు టీటీడీలో వస్త్రాల ఈ–వేలం

Spread the love

శ్రీ‌వారి భక్తుల‌కు దేవ‌స్థానం తీపి క‌బురు

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపిక‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మే 21 నుండి ఈ వేలం ద్వారా విక్ర‌యించ‌డం ప్రారంభించామ‌ని తెలిపింది. అయితే ఈ వేలం పాట కార్య‌క్ర‌మం వ‌చ్చే నెల‌ జూన్ 2వ తేదీ వరకు ఈ–వేలంపాట కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ.

ఈ వేలంలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 లాట్లు అందుబాటులో ఉన్నాయని వెల్ల‌డించింది. వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి ఉన్నాయని తెలిపింది.

ఆసక్తి గల భ‌క్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాల‌ని కోరింది.. అలాగే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.konugolu.ap.govt.in / www.tirumala.org ద్వారా కొనుగోలు చేయాల‌ని పేర్కొంది టీటీడీ.

  • Related Posts

    వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    Spread the love

    Spread the loveశ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి గుడిలో తిరుపతి : తిరుప‌తి లోని నారాయణ వనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 24న ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉదయం…

    జూన్ 5న దివ్య పుష్ప యాగ మ‌హోత్స‌వం

    Spread the love

    Spread the loveశ్రీ వేద నారాయణ స్వామి వారి ఆల‌యంలో తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *