సంస్థ బ‌లోపేతం కోసం కృషి చేయాలి

పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్

శ్రీ స‌త్య సాయి జిల్లా : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ‌ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్’లో భాగంగా సత్యసాయి జిల్లాలోని శిక్షణ విభాగంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల ‘అంత్యోదయ’ తత్వం, జాతీయవాద భావజాలం, సేవా సూత్రం గురించి వివ‌రించారు పీవీఎన్ మాధ‌వ్.

అలాగే సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యకర్తలు పని చేయాల్సిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా వివరించారు. సంస్థ బలోపేతం, సామాజిక సేవ, జాతీయ అభివృద్ధి దిశగా ప్రతి కార్యకర్త అంకితభావంతో ముందుకు సాగాలని కోరారు. సేవ‌, నిబ‌ద్ద‌త‌, అంకిత భావం అనేది నేత‌లు, కార్య‌క‌ర్త‌లకు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు పీవీఎన్ మాధ‌వ్. వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *