సంస్థ బ‌లోపేతం కోసం కృషి చేయాలి

Spread the love

పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్

శ్రీ స‌త్య సాయి జిల్లా : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ‌ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్’లో భాగంగా సత్యసాయి జిల్లాలోని శిక్షణ విభాగంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల ‘అంత్యోదయ’ తత్వం, జాతీయవాద భావజాలం, సేవా సూత్రం గురించి వివ‌రించారు పీవీఎన్ మాధ‌వ్.

అలాగే సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యకర్తలు పని చేయాల్సిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా వివరించారు. సంస్థ బలోపేతం, సామాజిక సేవ, జాతీయ అభివృద్ధి దిశగా ప్రతి కార్యకర్త అంకితభావంతో ముందుకు సాగాలని కోరారు. సేవ‌, నిబ‌ద్ద‌త‌, అంకిత భావం అనేది నేత‌లు, కార్య‌క‌ర్త‌లకు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు పీవీఎన్ మాధ‌వ్. వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు.

  • Related Posts

    మోదీ విజ‌యంలో డీఎంకేకు కూడా భాగం ఉంది

    Spread the love

    Spread the loveఉద‌య‌నిధి స్టాలిన్ కామెంట్స్ పై కాంగ్రెస్ కౌంట‌ర్ చెన్నై, తమిళనాడు DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు తిరునావుక్కరసర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిప్పులు చెరిగారు. కాంగ్రెస్…

    నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *