నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

Spread the love

ప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తానని కూడా ఆయన తమకు హామీ ఇచ్చారని ఆ బాలిక తల్లిదండ్రులు తెలిపారు. POCSO చట్టం కింద కోయంబత్తూరుకు చెందిన ఆ బాలిక కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందించడం జ‌రిగింద‌న్నారు.ముఖ్యమంత్రి విజయ్ ఫోన్ ద్వారా వారిని సంప్రదించి, తన సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా బాలిక వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. కొత్త‌గా కొలువు తీరిన టీవీకే స‌ర్కార్ వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. సీఎం విజ‌య్ ఆదేశాల మేర‌కు ఇప్ప‌టికే మంత్రులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. నిందితులు ఎక్క‌డ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎవ‌రైనా స‌రే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    మోదీ విజ‌యంలో డీఎంకేకు కూడా భాగం ఉంది

    Spread the love

    Spread the loveఉద‌య‌నిధి స్టాలిన్ కామెంట్స్ పై కాంగ్రెస్ కౌంట‌ర్ చెన్నై, తమిళనాడు DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు తిరునావుక్కరసర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిప్పులు చెరిగారు. కాంగ్రెస్…

    సంస్థ బ‌లోపేతం కోసం కృషి చేయాలి

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ శ్రీ స‌త్య సాయి జిల్లా : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు పాటు ప‌డాల‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *