రాజ‌స్తాన్ యాజ‌మాన్యానికి రుణ‌ప‌డి ఉంటా

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ

జైపూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దుమ్ము రేపాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను అత్యధిక సిక్స‌ర్ల‌తో రికార్డ్ సృష్టించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అంతే కాదు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు. ఐపీల్ లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇదిలా ఉండ‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌త్యేకించి త‌న‌ను ఎంపిక చేసిన రాహుల్ ద్ర‌విడ్ కు, మాజీ కెప్టెన్ సంజు శాంస‌న్ తో పాటు ప్ర‌స్తుతం త‌న‌ను అక్కున చేర్చుకుని, ఆద‌రిస్తున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు యాజ‌మాన్యానికి రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నాడు.

టీం యాజమాన్యానికి నేను నిజంగా ఎంతో కృతజ్ఞుడిని. రెండేళ్ల క్రితం, వారు నన్ను విశ్వసించి తమ జట్టులోకి తీసుకున్నారు. RR యాజమాన్యం నా జీవితాన్ని, అలాగే నా కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. రెండేళ్ల క్రితం నా దగ్గర పెద్దగా ఏమీ ఉండేది కాదు, కానీ ఈ రోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి. RR యాజమాన్యానికి నేను అత్యంత రుణపడి ఉంటాను. వారి సహకారం లేకపోతే, నేను ఈ స్థాయికి చేరుకోగలిగే వాడిని కాద‌న్నాడు వైభ‌వ్ సూర్య‌వంశీ.

  • Related Posts

    ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి పాండ్యా ఔట్ ..?

    Spread the love

    Spread the loveఐపీఎల్ 2026 సీజన్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ముంబై : రిల‌య‌న్స్ గ్రూప్ న‌కు చెందిన ముంబై ఇండియ‌న్స్ ఈసారి జ‌రిగిన ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ప్ర‌ధానంగా…

    ఇషాన్ కిష‌న్ పై కావ్య మార‌న్ సీరియ‌స్

    Spread the love

    Spread the loveమ్యాచ్ ముగిసేంత దాకా ఉండ‌క పోతే ఎలా..? చెన్నై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ను కోల్పోయింది బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు పొందిన కావ్య మార‌న్ ఓన‌ర్ గా ఉన్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *