ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

రేపు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నుంది

న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ట్టుండి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఇండియాకు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె ప్ర‌ముఖ తాజ్ మ‌హ‌ల్ ను ఆదివారం సంద‌ర్శించనున్నారు. ఈ విష‌యం ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. అయితే ట్రంప్ కూతురు కావ‌డంతో భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆమె ఆగ్రాకు నేరుగా చేరుకుంటార‌ని స‌మాచారం.

మరుసటి రోజు ఉదయం ఆమె తాజ్ మహల్‌ను సందర్శించనున్నారని అధికారులు వెల్ల‌డించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కానీ ఎవ‌రికీ స‌మాచారం లేదు. త‌ను ఒక ప్రత్యేక విమానం (chartered aircraft) ద్వారా ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయానికి పయనం అయ్యారు. ఆదివారం ఉదయం ఆమె తాజ్ మహల్‌ను సందర్శించి, ఆ చారిత్రక కట్టడం వద్ద సుమారు గంటన్నర సమయం గడపనున్నారు. మధ్యాహ్నం వేళ, ఆమె ఖేరియా విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో జైసల్మేర్‌కు బయలుదేరతారు. టిఫానీ ట్రంప్ పర్యటన వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, భద్రతాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు , స్థానిక యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *