ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం

4న జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది.

ఈ పార్టీల ప్రతినిధులు 4వ తేదీ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయంలోకి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు వీలుగా ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్ (87126 66004 )ని సంప్రదించాలని ఒక అధికారిక ప్రకటనలో కోరింది. ఇదిలా ఉండ‌గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం. ప‌లు పార్టీలు ప్ర‌భుత్వం ఉదాసీన వైఖ‌రి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

  • Related Posts

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    విప‌క్షాల నినాదాల మ‌ధ్య రాజ్య‌స‌భ వాయిదా

    న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా ప‌డింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *