కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు

రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీక‌ర‌ణకు ఓకే

న్యూఢిల్లీ : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది. విమాన‌యాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధ‌ర స్థిరీక‌ర‌ణ నిధికి రూ. 10 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడం దీని లక్ష్యం. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ATF ధరలు 2.5 రెట్లు పెరిగాయి. ATF ధర లీటరుకు ₹60.5 (మార్చి-26 నాటికి) నుండి ₹142 (మే-26 నాటికి)కి పెరిగిందిఅంతే కాకుండా Delhi-NCR కోసం ₹5,041 కోట్లకు ఆమోదం తెలిపింది మంత్రివ‌ర్గం. పాత BS-I నుండి BS-IV శ్రేణి ట్రక్కులు, బస్సుల మార్పిడిని లక్ష్యంగా చేసుకుంది. 1.9 లక్షలకు పైగా ట్రక్కులు ,16,000 బస్సులను ఈ పథకం పరిధిలోకి తెస్తుంది.

BS-VI మరియు విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుకు కూడా కేబినెట్ ప్ర‌యారిటీ ఇచ్చింది. తెలంగాణలో రహదారుల నిర్మాణం చేప‌ట్టేందుకు రూ. 7,597 కోట్ల‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా జాతీయ ర‌హ‌దారుల 4 లేన్ల విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నుంది. బీహార్ లో ర‌హ‌దారుల కోసం రూ. 8,936 కోట్లు, ఒడిశా తీర ప్రాంత ర‌హ‌దారి కోసం రూ. 8,301 కోట్లకు ఆమోదించింది కేబినెట్. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం కోసం రూ. 4,415 కోట్ల‌కు ఓకే చెప్పింది. ర‌హ‌దారి ప్రాజెక్టుల కోసం రూ. 29,000 కోట్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *