రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
అమరావతి : ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం – అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తయిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందని అన్నారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
ఈ ఏడాది చివరి నాటికి 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. చంద్రబాబు సమర్థ, సుస్థిర పాలనతో పెట్టబడిదారుల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో దేశంలోనే అగ్రగామిగా 25 % పెట్టుబడులు సాధిస్తూ, పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. పెట్టుబడుల రాకతో, పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మంత్రి. రాష్ట్రంలో భయాందోళనలు లేని, ప్రశాంతమైన ప్రజాస్వామ్య పాలనకు రెండేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.





