అర‌వింద్ కేజ్రీవాల్ తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

Spread the love

దేశంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పై విస్తృత చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైన అనంత‌రం ఉన్న‌ట్టుండి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ, దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ తో క‌లిసి నేరుగా ఆప్ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. వీరు గంట‌కు పైగా స‌మావేశం కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఈ సంద‌ర్బంగా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి చ‌ర్చించారు. స‌ర్ పేరుతో ఓటర్ల‌ను జాబితాల నుండి తొల‌గించ‌డంపైనే పెద్ద ఎత్తున చర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో కేజ్రీవాల్ ను జైలు పాలు చేశారు. త‌న‌కు అనుంగు అనుచ‌రుడిగా పేరు పొందిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరేలా చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు క‌మ‌లనాథులు. త్వ‌ర‌లో బెంగాల్ లో క‌మ‌లం అధికారంలోకి వ‌చ్చిన‌ట్లుగానే పంజాబ్ లో కూడా సైలెంట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టేందుకు రెడీ అయ్యింది. ఈ త‌రుణంలో మాజీ సీఎంలు దీదీ, కేజ్రీవాల్ లు క‌లిసి స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

  • Related Posts

    కేంద్రం నిర్వాకంపై ఇండియా కూట‌మి యుద్దం

    Spread the love

    Spread the loveస్పష్టం చేసిన కూట‌మి పార్టీ నేత‌ల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ (CPP) చైర్‌పర్సన్ సోనియా…

    రామోజీరావుకు సీఎం చంద్ర‌బాబు నివాళి

    Spread the love

    Spread the loveఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అమ‌రావ‌తి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఓ యుగకర్త,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *