అర‌వింద్ కేజ్రీవాల్ తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

దేశంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పై విస్తృత చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైన అనంత‌రం ఉన్న‌ట్టుండి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ, దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ తో క‌లిసి నేరుగా ఆప్ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. వీరు గంట‌కు పైగా స‌మావేశం కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఈ సంద‌ర్బంగా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి చ‌ర్చించారు. స‌ర్ పేరుతో ఓటర్ల‌ను జాబితాల నుండి తొల‌గించ‌డంపైనే పెద్ద ఎత్తున చర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో కేజ్రీవాల్ ను జైలు పాలు చేశారు. త‌న‌కు అనుంగు అనుచ‌రుడిగా పేరు పొందిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరేలా చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు క‌మ‌లనాథులు. త్వ‌ర‌లో బెంగాల్ లో క‌మ‌లం అధికారంలోకి వ‌చ్చిన‌ట్లుగానే పంజాబ్ లో కూడా సైలెంట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టేందుకు రెడీ అయ్యింది. ఈ త‌రుణంలో మాజీ సీఎంలు దీదీ, కేజ్రీవాల్ లు క‌లిసి స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

  • Related Posts

    ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాలి

    ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల…

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *