మోదీ నాయ‌క‌త్వం దేశానికి ఆద‌ర్శ‌ప్రాయం

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్

విజయవాడ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం దేశానికి ఆద‌ర్శ ప్రాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఒక నేత అతి సాధారణ జీవితం గడుపుతూ కృషి, పట్టుదలతో ఎదిగారన్నారు. మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదగడం మనందరికీ గర్వకారణం అన్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా మోదీ ఉన్నారన్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత, అవినీతి మచ్చ లేని నాయకుడు మోదీ అని కొనియాడారు. దేశంలో అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేసి చూపించింది బీజేపీ అని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా యువత కలిగిన దేశం మనది అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను యువ మోర్చా అర్ధం చేసుకోవాలని కోరారు మాధ‌వ్.

చదువుకు చేసే ఉద్యోగానికి సారూప్యత లేని సమయంలో స్కిల్ ఇండియా ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మోదీ ఏఏ అంశాలను ప్రత్యక్షంగా చూశారో వాటిని పథకాల రూపంలో తీసుకు వచ్చారని అన్నారు. దేశ భక్తి పెంపొందించే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉన్నాయ‌న్నారు. దేశ అస్తిత్వానికి సంబంధించి పోరాటాలు చేసింది బీజేపీ అని గుర్తు పెట్టుకోవాల‌న్నారు మాధ‌వ్. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభమయ్యింది అని అన్నారు. దీనిపై రాష్ట్ర యువ మోర్చా అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *