నాంప‌ల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

సంధ్య థియేటర్‌కు సంబంధించిన కేసు పై

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు .ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.

అందువల్ల, సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు , ప్రజలు న్యాయస్థానం జారీ చేసిన ఈ ఉత్తర్వులను గౌరవించి, కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది నాంప‌ల్లి కోర్టు. ఇదిలా ఉండ‌గా ఇవాళ సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్ కు స‌మ‌న్లు జారీ చేసింది.

  • Related Posts

    డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ సీరియ‌స్

    ముంబై : సోషల్ మీడియాలో తనవిగా ఆరోపించబడుతున్న, మార్ఫింగ్ చేసి ఏఐ (AI) ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ ఫోటోలు ప్రచారం కావడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆ కంటెంట్‌ను “అనధికారికమైనది, చట్టవిరుద్ధమైనది”గా పేర్కొంటూ, దానిని వెంటనే తొలగించాలని నటి…

    త‌మిళ‌నాట సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా త్రిష్ కృష్ణ‌న్

    చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఇప్పుడు న‌టి త్రిష కృష్ణ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ త‌రుణంలో కావేరి సమ‌స్య గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డీఎంకే ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *