మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది
చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభ జరిగింది. ఈ సందర్బంగా జాతీయ గీతం ఆలపించడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు. దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది తమ హయాంలో జరగలేదని, మీరు పాలించిన సమయంలోనే చోటు చేసుకుందన్నారు. బట్ట కాల్చి తమ మీద వేస్తామంటే కుదరదని చెప్పారు సీఎం. ఇదిలా ఉండగా కీలక ప్రసంగం చేశారు . రాష్ట్రంలో అవినీతిని సహించేది లేదని ప్రకటించారు. ఇందులో ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఇదే క్రమంలో తమ పార్టీకి చెందిన వారున్నా సరే వదిలి పెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా తమ పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోందని చెప్పారు సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. అయితే ప్రజాధనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు సీఎం . రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇప్పటికే పాలించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. తాము వచ్చాక అన్నింటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు.






