త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

Spread the love

ప్ర‌జాస్వామ్య ప్రాధాన్య‌త‌పై ప్ర‌సంగం

చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ త‌న‌కు మాట్లాడ‌టం రాదంటూ విప‌క్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తన‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, త‌దిత‌ర పార్టీల నాయ‌కుల‌కు కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయ‌న త‌న స్టైల్ లో ప్ర‌సంగం చేశారు. ప్ర‌జాస్వామ్యం అంటే దోచుకోవ‌డం కానే కాద‌ని ప్ర‌జ‌ల‌కు సేవకులుగా ఉండ‌డమేన‌ని స్ప‌ష్టం చేశారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

నక్కలకు వ్యతిరేకంగా ఆయ‌న త‌న గొంతు వినిపించారు. తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కు త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల కోసం అలుపెరుగ‌ని రీతిలో ప‌ని చేస్తానంటూ మ‌రోసారి స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు . ముఖ్యమంత్రికి మాట్లాడటం రాదా? అని ముసుగులు వేసుకుని వచ్చినవారు త‌ను మాట్లాడటం మొదలు పెట్టగానే వారి ముసుగులు తొలగి పోయాయి, తిరిగి ఒక్క మాట కూడా అనకుండానే వారు పారిపోయారు. త‌ను ప్ర‌జ‌ల మ‌నిషినన‌ని, ప్ర‌జా సేవ త‌ప్ప త‌న‌కు వేరే తెలియ‌ద‌ని ప్ర‌క‌టించారు. ఇక నుంచి పాల‌న మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా చూస్తాన‌ని అన్నారు. మొత్తంగా ఇవాళ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    వ‌రి సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని కేంద్రం పెంచాలి

    Spread the love

    Spread the loveకోరిన నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ హైద‌రాబాద్ : నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వరి సేకరణ లక్ష్యంలో భారీ సవరణ కోరారు. రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి…

    అవినీతిని సహించేది లేదు : సీఎం విజ‌య్

    Spread the love

    Spread the loveమా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జాతీయ గీతం ఆల‌పించ‌డం పై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *