త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

ప్ర‌జాస్వామ్య ప్రాధాన్య‌త‌పై ప్ర‌సంగం

చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ త‌న‌కు మాట్లాడ‌టం రాదంటూ విప‌క్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తన‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, త‌దిత‌ర పార్టీల నాయ‌కుల‌కు కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయ‌న త‌న స్టైల్ లో ప్ర‌సంగం చేశారు. ప్ర‌జాస్వామ్యం అంటే దోచుకోవ‌డం కానే కాద‌ని ప్ర‌జ‌ల‌కు సేవకులుగా ఉండ‌డమేన‌ని స్ప‌ష్టం చేశారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

నక్కలకు వ్యతిరేకంగా ఆయ‌న త‌న గొంతు వినిపించారు. తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కు త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల కోసం అలుపెరుగ‌ని రీతిలో ప‌ని చేస్తానంటూ మ‌రోసారి స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు . ముఖ్యమంత్రికి మాట్లాడటం రాదా? అని ముసుగులు వేసుకుని వచ్చినవారు త‌ను మాట్లాడటం మొదలు పెట్టగానే వారి ముసుగులు తొలగి పోయాయి, తిరిగి ఒక్క మాట కూడా అనకుండానే వారు పారిపోయారు. త‌ను ప్ర‌జ‌ల మ‌నిషినన‌ని, ప్ర‌జా సేవ త‌ప్ప త‌న‌కు వేరే తెలియ‌ద‌ని ప్ర‌క‌టించారు. ఇక నుంచి పాల‌న మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా చూస్తాన‌ని అన్నారు. మొత్తంగా ఇవాళ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    లోక్ స‌భ ట్రిబ్యున‌ల్స్ సంస్క‌ర‌ణ‌ల బిల్లు

    న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలలో బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లును ఆమోదించగా ప్రతిపక్ష ఎంపీల నుండి తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లును చర్చ లేకుండా ఆమోదించింది. రాజ్యసభ సోమవారం బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు, 2026ను…

    ఆగ‌స్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి స‌మావేశాల తేదీల‌ను వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయ‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *