ఒకే వేదిక‌పై ముగ్గురు ముఖ్య‌మంత్రులు

Spread the love

ఒకే ఫ్రేమ్‌లో CBN, రేవంత్, DK

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. గుర‌వారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు. సాధ్య‌మైనంత మేర‌కు సామ‌ర‌స్య పూర్వ‌కంగా నీటి పంప‌కాలు చేప‌ట్టాల‌ని కోరారు.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు మ‌రింత ముదురుకున్నాయి. ఈ సంద‌ర్బంగా ముగ్గురు సీఎంలు ఒకే వేదిక‌పైకి రావ‌డం, క‌లుసు కోవ‌డం, చ‌ర్చలు జ‌ర‌ప‌డం ఒకందుకు ఆశ్చ‌ర్యం అనిపించింది. అయితే పాలిటిక్స్ లో ఆరితేరిన చంద్ర‌బాబు నాయుడు కు శిష్యుడిగా పేరు పొందాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో క‌ర్నాట‌క సీఎంగా ఇటీవ‌లే కొలువు తీరిన డీకే శివ‌కుమార్ కు నారా చంద్ర‌బాబుతో మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య ఒప్పందాలు, లావాదేవీలు ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Related Posts

    ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి

    Spread the love

    Spread the loveనియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్…

    ఎమ‌ర్జెన్సీ చారిత్ర‌క సంఘ‌ట‌న కాదు

    Spread the love

    Spread the loveఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివ‌సేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంద‌లో భాగంగా 9వ త‌ర‌గ‌తి సాంఘిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *