సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన త్రిష కృష్ణన్
గోవా : ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఖుష్బు సుందర్, సి సుందర్ ల కూతురు పెళ్లి గోవాలోని రిసార్ట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా తమ కూతురు పెళ్లికి రావాలని స్వయంగా సీఎం విజయ్ ని కలిసి ఆహ్వానించారు ఖుష్బు సుందర్. తను తప్పకుండా వస్తానని మాట కూడా ఇచ్చాడు. అయితే ఇవాళ జరిగిన వేడుకలో తను మిస్ అయ్యాడు. కానీ తాను ప్రేమించిన బ్యూటీ త్రిష కృష్ణన్ హాజరైంది. వివాహ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
విజయ్ హాజరు కాక పోయినప్పటికీ నటి త్రిష కృష్ణన్ ఈ కార్యక్రమం కోసం గోవాకు వెళ్ళిన ప్రముఖ అతిథులలో ఒకరిగా నిలిచారు. వివాహ ఆహ్వానాన్ని స్వయంగా అందించడానికి ఖుష్బూ. ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల ప్రారంభంలో చెన్నైలోని విజయ్ నివాసంలో తనను కలిశారు. ప్రయాణపరమైన ఇబ్బందులు , అత్యంత బిజీగా ఉన్న అధికారిక షెడ్యూల్ కారణంగా ముఖ్యమంత్రి ఈ వేడుకకు హాజరు కాలేక పోయారని సమాచారం. ఇటీవలి రాజకీయ బాధ్యతల కారణంగా విజయ్ చాలా బిజీ షెడ్యూల్ను కలిగి ఉండటంతో, రాష్ట్రం దాటి ప్రయాణించడం కష్టంగా మారింది. ఆయన హాజరు కాక పోయినప్పటికీ, ఈ వివాహం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల సందడితో ఘనంగా జరిగింది.







