అక్కా చెల్లెళ్ల‌తో ఆటాడుకుంటున్న చంద్ర‌బాబు

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు వీరిలో చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు, స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్క చెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిలు పెట్టారని పేర్కొన్నారు మాజీ సీఎం .

గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.1000 ఉండే జీతాన్ని రూ.3000 వేల వరకూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు , ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో వీరిని తొల‌గించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున పోరాడుతాం అని ప్ర‌క‌టించారు జ‌గ‌న్ రెడ్డి. వారికి అండగా నిలుస్తాం అన్నారు. ఇప్పటికే బకాయి పెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని అన్నారు.

  • Related Posts

    వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై బీజేపీ ఫైర్

    Spread the love

    Spread the loveఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని…

    విశ్వ‌క‌ర్మ‌ల‌ను ఒక్క‌టిగా గుర్తించాలి

    Spread the love

    Spread the loveఅడ్లూరి ర‌వీంద్రాచారి డిమాండ్ హైద‌రాబాద్ : విశ్వ బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల‌పై శ‌నివారం సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. విశ్వ‌క‌ర్మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వ‌హించిన‌ ఈ స‌మావేశంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *