విజయవాడలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు

విజ‌య‌వాడ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విజ‌య‌వాడ‌లో మెరుపు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే కారణాలపై ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి . ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయట పడటంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. కాగా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Related Posts

    2027 నాటికి 72,70,605 పాసు పుస్త‌కాలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నాం అన్నారు. 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70.,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ…

    బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల నుంచి రూ. 1400 కోట్లు

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న తండ్రి ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండి ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో వచ్చాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *