న్యూఢిల్లీ : ఏపీలోని శ్రీహరి కోట వేదికగా దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా తయారు చేసిన ఉపగ్రహం శనివారం అధికారికంగా అంతరిక్షంలోకి వెళ్లింది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. భారత్ తన సత్తా ఏమిటో ఈ ప్రపంచానికి తెలియ చేసిందని పేర్కొన్నారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ కక్ష్య ప్రయోగ సామర్థ్యం కలిగిన మూడవ దేశంగా స్కైరూట్ ఏరోస్పేస్ నిలవడంతో, ఈ మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. భారతదేశ అంతరిక్ష రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిన సందర్భంగా ఆనందంగా ఉందన్నారు.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన తర్వాత, రాకెట్ తన చివరి బర్న్ను పూర్తి చేసి, పేలోడ్లను 450 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశ పెట్టిందని హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ ధృవీకరించింది. ఈ విజయంతో, ప్రైవేట్ కక్ష్య ప్రయోగ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ప్రపంచంలోని మూడవ దేశంగా భారతదేశం నిలిచింది. ఇది దేశంకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న వాణిజ్య అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఈ విజయవంతమైన యాత్ర భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త దశకు నాంది పలికింది, దీనితో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా స్వతంత్రంగా కక్ష్యను చేరుకోగలవు.





